వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం
- May 26, 2019ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్ స్టోరీస్ యాడ్స్ను తీసుకు రానున్నామని ప్రకటించింది. ఈవారంలో నెదర్లాండ్స్లో జరిగిన మార్కెటింగ్ సదస్సుకు హాజరైన ఆలివర్ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆండ్రాయిడ్ 2.18.305 బీటా వెర్షన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. ఈ యాడ్స్ని ఫేస్బుక్కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది.
గత ఏడాది అక్టోబర్లోనే వాట్సాప్ ప్రకటనలపై వార్తలు మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేశాయి..అయితే వాట్సాప్ ఈ వార్తలను తాజాగా ధృవీకరించింది. స్టేటస్లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్ ద్వారా స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సాప్ స్టేటస్లలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని మోచిస్తోంది. ఈ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. భారత్లో వీరి సంఖ్య 250 మిలియన్లు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!