శ్రీవారిని దర్శించుకున్న వై.యస్ జగన్‌

- May 29, 2019 , by Maagulf
శ్రీవారిని దర్శించుకున్న వై.యస్ జగన్‌

తిరుమల: తిరుమల శ్రీవారిని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న కాబోయే సీఎం జగన్‌కు టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకాపా ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను, పలువురు సీనియర్‌నేతలు జగన్‌తో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com