ఇందిరాగాంధీ పాత్రలో అలనాటి అందాల తార
- May 29, 2019ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రవీనాటాండన్ ఇప్పుడు ముఖ్యపాత్రలలో మెరుస్తోంది. 90వ దశకంలో అక్కినేని నటించిన రధసారథిలోనూ, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రంలోనూ రవీనాటాండన్ కథనాయికగా నటించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలే చేస్తూ వచ్చిన ఆమె ఇన్నేళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఆ మధ్య కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రం తెరకెక్కుతోంది. చాప్టర్-1కు వివిధ భాషల్లో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్ను నిర్మించే పనిలో చిత్రబృందం ఉంది. కాగా పీరియాడిక్ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన సన్నివేశాలున్నాయట. దాంతో ఆ పాత్రకు రవీనా అయితే న్యాయం చేకూరుస్తుందని, అంతేకాకుండా ఆమె నటించడం వల్ల బాలీవుడ్లో చిత్రాన్ని మార్కెట్ చేయడం కూడా సులువు అవుతుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!