8 మంది మృతికి కారణమైన కువైటీ టీనేజ్ డ్రైవర్ అరెస్ట్
- May 29, 2019కువైట్: చిన్న రోడ్డు ప్రమాదం జరగడంతో, అక్కడ గుమికూడి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపైకి మరో వాహనం వేగంగా దూసుకురావడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్లో చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. కబాద్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించి, 17 ఏళ్ళ కువైటీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయగా అందులో ముగ్గురు కువైటీలు, ముగ్గురు సౌదీలు ఓ బెడౌన్ మరియు ఇద్దరు ఓ గుర్తు తెలియని వ్యక్తి వున్నారు. పలువురు గాయాల బారిన కూడా పడ్డారు. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు వుంటాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుపై ప్రజలు గుమి కూడడడం మంచిది కాదనీ, అదే సమయంలో రోడ్డుపై పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు