5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!