కమెడియన్ దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూత
- June 05, 2019ప్రముఖ నటుడు, కమెడియన్ దిన్యర్ కాంట్రాక్టర్(79) ముంబయిలో ఈ ఉదయం కన్నుమూశారు. వృద్ధ్యాప్య కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వర్లీ శ్మాశనవాటికలో నేడు అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. దిన్యర్ హాస్య నటనకు పెట్టింది పేరు. 2001లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ చోరీ చోరీ చుప్కే చుప్కేలో హోటల్ మేనేజర్గా, అక్షయ్ కుమార్ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్ పాత్రలో, షారుక్ ఖాన్ నటించిన బాద్షాలో క్యాసినో మేనేజర్గా వేసిన పాత్రలు దిన్యర్కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దిన్యర్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. నాటకరంగమైన, టీవీయైన, సినిమాలైన తన నటనతో ఎంతో మంది ముఖాల్లో చిరునవ్వులు పూయించిన వ్యక్తిగా కొనియాడారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ