తిరు దర్శకత్వంలో హీరో గోపీచంద్

- June 07, 2019 , by Maagulf
తిరు దర్శకత్వంలో హీరో గోపీచంద్

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కథలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు 'తిరు'తో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. తనను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం కథానాయకుడు ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com