దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్‌ డాలర్లను గెల్చుకున్న ఇండియన్‌

- June 11, 2019 , by Maagulf
దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్‌ డాలర్లను గెల్చుకున్న ఇండియన్‌

ఒమన్‌కి చెందిన భారతీయ వలసదారుడొకరు తాజా దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్‌ మిలియనీర్‌ డ్రా విజేతగా ప్రకటింపబడ్డారు. రఘు కృష్ణమూర్తి అనే భారతీయుడు ఈ బహుమతిని గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించిన 14వ భారతీయుడిగా నిలిచారు. మొత్తం 1 మిలియన్‌ డార్లు ఆయనకు బహుమతిగా దక్కనుంది. డ్రా తర్వాత, గత దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ విన్నర్‌కి ప్రెజెంటేషన్‌ అందించే కార్యక్రమం జరిగింది. దుబాయ్‌కి చెందిన 40 ఏళ్ళ రితీష్‌ కుమార్‌ రవీంద్రన్నాయర్‌ గత విజేతగా నిలిచారు. ఈ డ్రాలో బిఎండబ్ల్యు 750 ఎల్‌ఐ ఎక్స్‌ డ్రైవ్‌ వాహనాన్ని అబ్రహామ్‌ మెల్కునియన్‌ గెల్చుకున్నారు. మరో ఇద్దరు భారతీయులు బిఎండబ్ల్యు మోటర్‌ బైక్‌లను గెల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com