నైజీరియన్ చేతిలో మోసపోయిన తెలుగు హీరోయిన్..
- June 12, 2019టెక్నాలజీ పెరిగింది.. దాంతో పాటు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాంగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తుకున్నా సదరు వ్యక్తి మాటల వలలో చిక్కుకుపోతోంది యువత. ఫలితంగా డబ్బులు గుల్ల. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు అనేక మందికి ఫోన్లు చేసి బ్యాంకు వివరాలు అడిగి తెలుసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ పరిచయంతో నమ్మబలికిన కొందరు విదేశీ వ్యక్తులు మీకు గిప్టులు పంపాము. ఎయిర్ పోర్టులో ట్యాక్స్ కట్టి బహుమతులు తీసుకోండి అంటూ మరో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. ఈ లిస్టులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. తాజాగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సోనాక్షి వర్మ అనే హీరోయిన్ని నైజీరియన్ ముఠా దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆమె ఫేస్బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఓ రిక్వెస్ట్ రాగా.. దాన్ని యాక్సెప్ట్ చేసింది సోనాక్షి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం రోజూ ఛాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది. మెర్రిన్ తన వ్యక్తిగత వివరాలన్నీ సోనాక్షి చెబుతుండేవాడు. తాను లండన్లో ఉంటున్నానని, మీ తో స్నేహం చేయాలని ఉందని చెప్పడంతో సోనాక్షి అంగీకరించింది. ఇలా సాగుతున్న వారి వ్యవహారం.. ఓ రోజు తమ స్నేహానికి గుర్తుగా గిప్ట్ పంపిస్తున్నానన్నాడు మెర్రిన్. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తుందని చెప్పాడు. ఈ క్రమంలోనే మే 27న ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారిని అని అన్నాడు. మెర్రిన్ నుంచి మీకు బహుమతి వచ్చింది. దాన్ని హైదరాబాద్కు పంపాలంటే రూ.85 వేలు కట్టమని చెప్పాడు. అతడి మాటలు నమ్మి అధికారినని చెప్పిన వ్యక్తి ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసింది సోనాక్షి. వారం రోజులైనా గిప్ట్ పత్తాలేదు. అప్పటికి గాని తాను మోసపోయానని గుర్తించి సోనాక్షి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ