కేటీఆర్‌ చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి

- June 17, 2019 , by Maagulf
కేటీఆర్‌ చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి

శంషాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలోని జే.అండ్‌.పీ కంపెనీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బంధించబడ్డ కార్మికులు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు.శంషాబాద్‌కు చేరుకున్న వారికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తరపున NRI ఆఫీసర్ చిట్టిబాబు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అందజేశారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీ అరేబియాలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు.అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది.

అనేక కష్టాలు పడుతున్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని కేటీఆర్‌ ఆదేశించారు.వారందరి కృషి ఫలితంగా కార్మికులు తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టారు.సౌదీ అరేబియా నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా లోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ NRI శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 

మంద భీంరెడ్డి(ఇమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు) కేటీఆర్‌,తెలంగాణ NRI శాఖాధికారులను మరియు సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయ అధికారులను  అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com