వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయనున్న షార్జా పోలీసులు
- June 24, 2019వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయడానికి షార్జా పోలీసులు ఆదివారం కొత్త రేడియో ఆధారిత సేవను ప్రారంభించారు. ఈ సేవ అన్ని పోలీసు పెట్రోలింగ్లలో జూలై 1 నుండి లభ్యమవుతుంది.
సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్ మాట్లాడుతూ, ఈ పరికరం రేడియో తరంగాల ద్వారా పరిసర వాహనాలకు వివిధ భాషలలో సందేశాలను పంపుతుంది. పెట్రోలింగ్కు/పెట్రోలింగ్ వాహనం వస్తున్నట్లు వాహనదారులకు తెలియజేస్తూ వారికి దారి ఇవ్వవలసిందిగా సూచిస్తుంది. దీనిద్వారా అతి తక్కువ సమయంలో ఎమెర్జెనీ ప్రదేశానికి పోలీసులు చేరుకోవచ్చని తెలిపారు.
ఈ పరికరంలో రికార్డ్ చేయబడిన మూడు ఆడియో క్లిప్లు కలిగి ఉంటాయి. వాటిని ఇలా వివరించారు డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్:
- మొదటి సందేశం వాహనదారులను సమీపించే పోలీసు లేదా అత్యవసర వాహనం ఉనికిని హెచ్చరిస్తుంది.
- రెండవది అత్యవసర లేదా పోలీసు వాహనం ముందు నిలిపి ఉంచినట్లు వారిని హెచ్చరిస్తుంది.
- మూడవది పోలీసు వాహనం జంక్షన్ కు చేరుకున్నప్పుడు వాహనదారులను ఆపమని అభ్యర్థిస్తుంది.
ఈ సందేశాలను పాటించి ప్రతి వాహనదారుడు పోలీసు, అత్యవసర మరియు అధికారిక కాన్వాయ్ వాహనాలకు దారి వదిలి, అధికారులకు మెరుగైన సేవ అందించేందుకు సహకరించవలసినదిగా కోరారు.
ఈ సందేశాలను ఖాతరు చేయక/అడ్డుకునే వాహదారులకు 3 వేల డాలర్ల జరిమానా విధించబడతారని, వారి వాహనాలను ఆరు ట్రాఫిక్ పాయింట్లతో పాటు 30 రోజుల పాటు నిర్బంధించనున్నట్లు బ్రిగ్ అల్ నౌర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన