దుబాయ్ బస్ ప్రమాదం: డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష, 3.4 మిలియన్ దిర్హామ్ల బ్లడ్ మనీ జరీమానా?
- June 26, 2019దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్పై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష విధించాలనీ, అలాగే 3.4 మిలియన్ దిర్హామ్ల బ్లడ్ మనీ చెల్లించాల్సిందిగా ఆదేశించాలనీ ప్రాసిక్యూషన్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారణ తాజాగా న్యాయస్థానంలో జరిగింది. ఈ సందర్బంగా 53 ఏళ్ళ ఒమనీ డ్రైవర్పై అభియోగాలు నమోదయ్యాయి, వాటిపై విచారణ జరిగింది. 31 మందిని తీసుకెళుతున్న బస్సు, జూన్ 6న రోడ్ హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్ని అతి వేగంతో ఢీకొట్టింది. అల్ రష్దియా మెట్రో స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 31 మంది ప్రయాణీకుల్లో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయాలపాలయ్యారు. అందులో ఒకరు వైద్య చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 12 మంది భారత జాతీయులు, ఇద్దరు పాకిస్తానీయులు, ఒకరు ఒమన్, మరొకరు ఫిలిప్పీన్కి చెందినవారున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్