జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా
- July 11, 2019బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారింది. రనౌత్ కు, జర్నలిస్టులకు మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. ఈ నెల 7వ తేదీన తన తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' చిత్రానికి సంబంధించి కార్యక్రమంలో కంగన మాట్లాడుతూ, 'మణికర్ణిక' చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడారు. దీంతో కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పేవరకు ఆమెకు మీడియా కవరేజ్ చేయమని 'ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' ప్రకటించింది. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది. కంగానా మాత్రం క్షమాపణ చెప్పలేదు. అంతేకాదు, మీడియాను దుర్భాషలాడుతూ వీడియోను విడుదల చేసింది.
ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?' అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం