విజయ్‌ మాల్యా కు ఎదురుదెబ్బ

- July 12, 2019 , by Maagulf
విజయ్‌ మాల్యా కు ఎదురుదెబ్బ

ముంబయి: ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా తన ఆస్తుల జప్తులను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్‌ అఖిల్ ఖురేషి, జస్టిస్‌ ఎస్‌జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక తనపై వేసిన పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఇదే పిటిషన్‌లో కోరారు. దీన్ని ధర్మాసనం కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com