దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సమస్య
- July 16, 2019దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చెందిన మూడో టెర్మినల్లో 30 నిమిషాల పాటు విద్యుత్ సమస్య తలెత్తింది. అయితే, ఈ సమస్య కారణంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి ఎలాంటి సమస్యలూ రాలేదు. ఉదయం 11.04 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. 30 నిమిషాల్లోనే సమస్యను సరిదిద్దామని చెప్పారు. అయితే, ఏసీ యూనిట్స్ షట్ డౌన్ అవడంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. 1960లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. సుమారు 88.2 మిలియన్ ప్రయాణీకులు ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తుంటారు. 100 ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 240 డెస్టినేషన్స్కి తమ సేవల్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు