ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్‌

- July 17, 2019 , by Maagulf
ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ పాంగ్‌కాక్‌ పేర్కొన్నారు. పాంగ్‌కాక్‌ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, పారదర్శక విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాగా, రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతోనూ పాంగ్‌ భేటీ అయి రాజధానిపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com