టోల్ కట్టాల్సిందే అని తేల్చేసిన నితిన్ గడ్కరీ

- July 17, 2019 , by Maagulf
టోల్ కట్టాల్సిందే అని తేల్చేసిన నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేని కారణంగానే టోల్‌ వ్యవస్ధ కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రజలు మంచి సేవలను కోరుకుంటున్నట్లయితే టోల్‌ఫీజు కట్టాల్సిందేనని మంగళవారం లోక్‌సభలో రోడ్డు రవాణా, రహ దారుల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్‌పై జరిగిన చర్చకు సమాధానంగా అన్నారు. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మిం చిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలు పై కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై గడ్కరీ సమాధానమిస్తూ చెల్లించగల సామర్థ్య మున్న ఆయా ప్రాంతాలలో వసూలు చేస్తున్న టోల్‌ ఫీజును గ్రామీణ, పర్వత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణా నికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. టోల్‌ వ్యవస్ధ కొనసాగుతుందని, కాలాను గుణంగా టోల్‌ పీజులు మారతాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com