తానే ప్రిన్సెస్ డయానా అంటున్న బుడతడు!
- July 19, 2019బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మగ్ధులైపోయారు. అలాంటి అందాలరాణి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టింది. మళ్లీ పుట్టడమా.. అదేంటి అన్నదే కదా మీ సందేహం. అవునండి.. గత జన్మలో తానే ప్రిన్సెస్ డయానా అంటున్నాడు ఆస్ట్రేలియాలికు చెందిన ఓ బాలుడు. అతని పేరు బిల్లీ కాంప్బెల్.
ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో చనిపోగా.. ఆ తర్వాత 18 ఏండ్లకు బిల్లీ పుట్టాడు. రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడని డేవిడ్ తెలిపారు. డయానా కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల విషయాలు.. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించి కూడా బిల్లీ చెప్పాడని డేవిడ్ అన్నారు.
అసలు బిల్లీ కాంప్బెల్ ఎవరో తెలుసా? ఓ టీవీ యాంకర్ కుమారుడు. గత జన్మలో తాను ప్రిన్సెస్ డయానా అనీ, అప్పటి విషయాలు కూడా తనకు గుర్తున్నాయని ప్రకటించుకుంటున్నా డు. ఆమె వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన పలు విశేషాలను కూడా పంచుకుంటున్నాడు. పైగా, ప్రిన్సెస్ డయానా పిల్లలైన విలియమ్, హ్యారీలు తన పిల్లలేనని అంటున్నారు.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్