కులభూషణ్ పై ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నా - పాక్ ప్రధాని
- July 19, 2019ఇస్లామాబాద్ : కుల్భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసిజెే) ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. జాదవ్ను నిర్దోషిగా తేల్చినందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు హర్షిస్తున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో అతను దోషిగా ఉన్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. చట్టం ప్రకారమే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుందని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్ లో తెలిపాడు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన భారత నౌకాదళ విశ్రాంత అధికారి జాదవ్ను పాక్ మిలిటరీ కోర్టు దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భారత్కు అనుకూలంగా బుధవారం అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ఇచ్చింది. జాదవ్కి పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ ఉరిశిక్షపై మరోసారి పరిశీలించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్కు అవకాశం ఇవ్వాలని చెప్పింది. ఈ కేసులో 16 మంది న్యాయమూర్తుల్లో 15మంది భారత్ వాదనకు మద్దతు పలికారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ