భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్
- July 19, 2019బహ్రెయిన్: సల్మానియాలో మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భారత వలసదారుడు అబూబాకర్, రెండు కీడ్నీలూ ఫెయిల్ కావడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మొత్తం కుటుంబం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సన్నిహితులు కొంతమేర ధన సహాయం చేసినా అది సరిపోవడంలేదని సోషల్ వర్కర్ షబీర్ చెప్పారు. రమదాన్ మాసం తర్వాతి నుంచి అబూబాకర్ ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేర్చగా రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారనీ షబీర్ వెల్లడించారు. తదుపరి వైద్య చికిత్స కోసం ఇండియాకి తరలించడం జరిగిందనీ, అయితే చికిత్స చాలా ఖరీదైంది కావడంతో, బాధిత కుటుంబం సాయం కోరుతోందని షబ్బీర్ వివరించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ