నేడే ఏపీ గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు
- July 22, 2019ఏపీ నూతన గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఆయన అమరావతిలోని రాజ్భవన్లో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్గా ఉన్న నరసింహన్ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం నరసింహన్ విజయవాడకు రానుండగా.. సీఎం జగన్తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్నారు. ఏపీ గవర్నర్గా తనకు సహాయసహకారాలు అందించినందుకు నరసింహన్ ఈ విందును ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో.. ఆయనకు ఏపీ ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలకనున్నారు. గేట్ వే హోటల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి గవర్నర్గా వచ్చారు నరసింహన్. అనంతరం 2014లో రాష్ట్ర విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలకు ఆయనే ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఏపీకి కొత్త గవర్నర్ రావడంతో.. ఇకపై ఆయన తెలంగాణకు మాత్రమే గవర్నర్గా ఉండనున్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!