ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌..

- July 23, 2019 , by Maagulf
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌..

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏఐఐబీ తేల్చి చెప్పింది. అమరావతి అభివృద్ధికి రుణసాయం చేయలేమని ప్రపంచ బ్యాంక్ నిరాకరించిన వారం రోజులు గడవకముందే ఇప్పుడు మరో బ్యాంక్‌ వెనుకడుగు వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఓ న్యూస్‌ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్‌లో AIIB ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణసాయంపై వెనక్కి తగ్గడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com