డైరెక్టర్ వైవిఎస్ చౌదరి విడుదల చేసిన 'సంశయం' ట్రైలర్

- July 30, 2019 , by Maagulf
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి విడుదల చేసిన 'సంశయం' ట్రైలర్

'తాగుబోతు' రమేష్, అనిరుధ్ కస్తూరి, దివ్య ప్రధాన పాత్రల్లో.. మహేష్ చెంగారెడ్డి దర్శకుడిగా, నిర్మిస్తున్న చిత్రం 'సంశయం'. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''సంశయం అనే ఒక మంచి తెలుగు టైటిల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న మహేష్ చెంగారెడ్డి నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం చెన్నయ్‌లో రూమ్ మేట్స్. ఆ టైంలో మా మధ్య ఎక్కువగా సినిమాల గురించి డిస్కషన్ జరిగేది. ఆ డిస్కషన్‌లో మహేష్ చాలా జన్యూన్ రీజన్స్ చెప్తూ, తన ఐడియాస్‌ని షేర్ చేసుకునేవాడు. ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వశ్చన్స్ రేజ్ చేస్తూ మాకు బాగా హెల్ప్ అయ్యేవాడు. అలాంటి మహేష్.. 'సంశయం' అనే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో, మన రెగ్యులర్ లైఫ్‌లో కనిపించే క్యారెక్టర్స్‌ని సినిమాలో చూపించబోతున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ట్రైలర్‌లోనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసి, తను సినిమాలో ఏం చెప్పబోతున్నాడో చాలా క్లారిటీగా ఉన్నాడనిపించింది.

ఎన్.ఆర్.ఐ ఆర్టిస్ట్‌లను పెట్టుకుని, వాళ్ళచేత ఇంత మంచి పెర్ఫార్మన్స్‌ని రాబట్టుకొని, చాలా బాగా ఆర్గనైజ్ చేసాడు. గొప్ప విషయం ఏంటంటే, ఇందులో ఆర్టిస్ట్‌లు అందరూ జాబ్స్ చేసేవాళ్ళే. వాళ్ళతో ఓన్లీ వీకెండ్స్‌లో షూట్ చేస్తూ ఈ మూవీని కంప్లీట్ చేసాడంటే మహేష్‌కి సినిమా మీద ఎంత ఫ్యాషన్ ఉందో తెలుస్తుంది. చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు. సినిమా మంచి సక్సెస్ అయ్యి, మహేష్ డ్రీం వర్క్స్ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com