టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
- August 01, 2019ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఓ ప్రముఖ టీవీ చానల్ తమకు రూ. 3.50 కోట్లను ఇవ్వడంలో సురేష్ విఫలం అయ్యారని ఆరోపించగా, కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ 'బాండ్ బాజా బరాత్' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది హిందీలో సూపర్ హిట్ అయింది. అదే సమయంలో బెల్లంకొండ సురేష్, సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. తమ సినిమాలోని 19 సీన్లను 'జబర్దస్త్'లో కాపీ చేశారని ఆరోపిస్తూ, అప్పట్లోనే యశ్ రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శాటిలైట్ హక్కులను రూ. 3.50 కోట్లకు బెల్లంకొండ అమ్మేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకోర్టు, చిత్రాన్ని టీవీల్లో సైతం ప్రదర్శించరాదని ఆదేశించింది.
ఆపై సదరు టీవీ చానల్ తాము చెల్లించిన రూ. 3.50 కోట్లను తిరిగి చెల్లించాలని బెల్లంకొండ సురేష్ చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నా, ఇవాళ, రేపు అంటూ ఆయన తిప్పించుకున్నారు. దీంతో సదరు చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో చానెల్ ఇచ్చిన రూ. 3.50 కోట్ల మొత్తం ఇప్పుడు వడ్డీలతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరడం గమనార్హం.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA