మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు

- August 07, 2019 , by Maagulf
మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్‌లోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లి ఎయిమ్స్‌ నుంచి సుష్మా భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలోనే సుష్మాస్వరాజ్‌ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం సుష్మాస్వరాజ్‌ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్‌లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com