ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్పై దుబాయ్ పోలీస్ ప్రకటన
- August 07, 2019దుబాయ్:వాహనదారులు తమ వాహనాల్ని జాగ్రత్తగా నడపడం ద్వారా, చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాల నుంచి ఉపశమనం పొందవచ్చునని దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేవారి క్రమశిక్షణ వృధా పోదనీ, అలాంటి వారికి చిన్న చిన్న ఉల్లంఘనల నుంచి ఉపశమనం కల్పిస్తామని పేర్కొన్నారు. మోటరిస్టులు ట్రాఫిక్ చట్టాల్ని పద్ధతిగా అనుసరించడం కోసం తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో, అంతకు ముందు జరీమానాల్లో 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే, అంతకు ముందు ఉల్లంఘనల నుంచి 50 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. అదే 12 నెలలపాటు వాహనాల్ని జాగ్రత్తగా నడిపితే, ముందున్న జరీమానాల నుంచి 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంది. 9 నెలలకు 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన