ఇండియా:పోస్టాఫీస్లో రూ.20లతో సేవింగ్స్ అకౌంట్..
- August 09, 2019పోస్టాఫీసుల్లో డబ్బు డిపాజిట్ చేస్తే భద్రతతో పాటు బోలెడు ప్రయోజనాలు కూడా. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే కేవలం రూ.20లు ఉంటే సరిపోతుంది. పొదుపు ఖాతా తెరిచి ఏడాదికి 4 శాతం వడ్డీ పొందొచ్చు. ఇందులో ఉండే ప్రయోజనాలు ఒకసారి చూస్తే..
నగదు రూపంలో డబ్బులిచ్చి అకౌంట్ను ప్రారంభించొచ్చు. చెక్బుక్ ఫెసిలిటీ లేని అకౌంట్దారులు ఖాతాలో కనీసం రూ.50లు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అదే చెక్బుక్ ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ.500లు ఉండాలి. వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఏడాదిలో రూ.10,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. నామినేషన్ సౌకర్యం ఉంది. ప్రారంభించేటప్పుడైనా లేదా తర్వాత అయినా నామినీని చేర్చుకోవచ్చు. అకౌంట్ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్కు మార్చుకోవచ్చు. పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెరవొచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. అకౌంట్ యాక్టివ్గా ఉండాలంటే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కసారైనా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడమో లేదా విత్ డ్రా చేయడమో చేయాలి. ఏటీఎం ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్