శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌

- August 09, 2019 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌

హైదరాబాద్‌: కశ్మీర్‌పై నిర్ణయం తర్వాత ఉగ్రదాడులు జరగొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌పై నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికలతోపాటు, స్వాతంత్య్ర దినోత్సవం కూడా సమీపిస్తుండటంతో పోలీసులు రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com