ఫర్వానియాలో రెస్టారెంట్స్ మూసివేత
- August 10, 2019కువైట్ సిటీ: ఫర్వానియా మునిసిపాలిటీకి చెందిన ఎమర్జన్సీ టీమ్, కమర్షియల్ షాప్లు మరియు రెస్టారెంట్స్పై ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని నిర్వహించింది. ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్స్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహార పదార్థాల్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్స్కి మూసివేత ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్స్ టీమ్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే వుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నిబంధనలు పాటించాలని అధికారులు రెస్టారెంట్ల నిర్వాహకుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు