కేరళ వరదలు: ఒమన్‌ పౌరులకు హెచ్చరిక

- August 10, 2019 , by Maagulf
కేరళ వరదలు: ఒమన్‌ పౌరులకు హెచ్చరిక

మస్కట్‌: ఇండియాలోని ఒమన్‌ ఎంబసీ, తమ పౌరులకు కేరళ వరదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నందున, ఆ రాష్ట్రానికి వెళ్ళినవారు అప్రమత్తంగా వుండాలనీ, వెళ్ళాలనుకునేవారే తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు అధికారులు. ప్రమాదక పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకుపోయి వుంటే, ఢిల్లీలోని సుల్తానేట్‌ ఎంబసీని ఫోన్‌ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ముంబైలోని ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చునని అధికారులు తమ పౌరులకు తెలిపారు. కాగా, కోచి ఎయిర్‌ పోర్ట్‌ వరదల కారణంగా మూసివేయడంతో అక్కడికి టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com