కేరళ వరదలు: ఒమన్ పౌరులకు హెచ్చరిక
- August 10, 2019మస్కట్: ఇండియాలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు కేరళ వరదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నందున, ఆ రాష్ట్రానికి వెళ్ళినవారు అప్రమత్తంగా వుండాలనీ, వెళ్ళాలనుకునేవారే తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు అధికారులు. ప్రమాదక పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకుపోయి వుంటే, ఢిల్లీలోని సుల్తానేట్ ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ముంబైలోని ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చునని అధికారులు తమ పౌరులకు తెలిపారు. కాగా, కోచి ఎయిర్ పోర్ట్ వరదల కారణంగా మూసివేయడంతో అక్కడికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ