తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు
- August 10, 2019ఖతార్:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ ఖతార్ లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు సందర్భంగా జాగృతి కార్యవర్గ సభ్యులు హాజరై ప్రో. జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా గారు మాట్లాడుతూ..
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి , ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్ మరియు రమేశ్ పిట్ల తదితర నాయకులు హాజరై జయశంకర్ సార్ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్