పెరిగిన బంగారం ధర...

- August 13, 2019 , by Maagulf
పెరిగిన బంగారం ధర...

బంగారం ధర మండిపోతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫెడ్ వడ్డీరేట్లు, అమెరికా చైనా ట్రేడ్‌వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ పెరిగిన క్రమంలో బంగారం ధర భారీగా పెరుగుతూ పోతోంది. భారత్‌లో బంగారం ధరలు రూ.38 వేలు మార్కెట్‌ను దాటి 40 వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. వెండి కూడా దాదాపుగా ఇదే రేంజ్‌లో పరుగులు పెడుతోంది. కాగా, పాకిస్తాన్‌లో ఇండియాతో పోలిస్తే బంగారం రెట్టింపు ధర పలుకుతుంది. సోమవారం పాకిస్తాన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.74,588గా ఉంది. ఇక అక్కడ బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com