పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం

- August 13, 2019 , by Maagulf
పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌లోని ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌ బోర్డ్‌లోంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్‌ బోర్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కుఉమ్‌లోని సుల్తాన్‌ కబూస్‌ స్ట్రీట్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుఉ ప్రయత్నించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com