ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు

- August 13, 2019 , by Maagulf
ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు

యూ.ఏ.ఈ:మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఆచూకీ కోసం 65 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన మహిళ రోహిని పెరీరా 65 రోజులుగా కన్పించడంలేదని ఆమె భర్త మధుసూధనన్‌ చెప్పారు. ఎక్కడో ఓ చోట ఆమె జీవించే వుంటుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. మధుసూధనన్‌ కేరళకు చెందిన వ్యక్తి. జూన్‌ 9 నుంచి తన భార్య అదృశ్యమయ్యిందని ఆయన వివరించారు. మధుసూధనన్‌, రోహిణిలకు ఐదుగురు సంతానం. ఈద్‌ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి తన భార్య కనిపించే అవకాశం వుందంటూ తన భార్య ఆచూకీ కోసం అందర్నీ అభ్యర్థిస్తున్నారు మధుసూధన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com