దుబాయ్‌కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా

- August 22, 2019 , by Maagulf
దుబాయ్‌కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా

భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్‌ లైన్స్‌ ముంబై మరియు దుబాయ్‌ మధ్య డైలీ సర్వీస్‌లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్‌ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్‌ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్‌కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్‌కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్‌ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్‌, ఎకానమీ క్లాస్‌తోపాటు ప్రీమియమ్‌ ఎకానమీ క్లాస్‌లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్‌ అయిన బ్యాంకాక్‌కి ఈ నెల 27న విమాన సర్వీస్‌ ప్రారంభించనుంది విస్తారా. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com