దుబాయ్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా
- August 22, 2019భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ముంబై మరియు దుబాయ్ మధ్య డైలీ సర్వీస్లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్, ఎకానమీ క్లాస్తోపాటు ప్రీమియమ్ ఎకానమీ క్లాస్లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్కి ఈ నెల 27న విమాన సర్వీస్ ప్రారంభించనుంది విస్తారా.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!