రాకేష్‌ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం

- August 23, 2019 , by Maagulf
రాకేష్‌ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం

హైదరాబాద్:యూ.ఏ.ఈ లో సంగీత రంగంలో విశేష సేవలందిస్తోన్న రాకేష్‌ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాకేష్‌ మరింగంటి అందుకున్నారు. హైద్రాబాద్‌లోని యువ ఆర్ట్స్‌ థియేటర్‌ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు.ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com