బహ్రెయిన్‌తో భారత్‌ బంధం మరింత బలోపేతం

- August 23, 2019 , by Maagulf
బహ్రెయిన్‌తో భారత్‌ బంధం మరింత బలోపేతం

బహ్రెయిన్‌:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్‌లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్‌లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్‌తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్‌తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్‌లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్‌ - భారత్‌ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్‌ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. భారత్‌ - బహ్రెయిన్‌ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల బై లేటరల్‌ ట్రేడ్‌ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com