'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
- September 12, 2019మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ భారీ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే.
అతి త్వరలో యూట్యూబ్ ద్వారా ఒక్కొక్క పాటను రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించి అప్పుడే భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలయ్యాయని, కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ ని నిర్వహించాలని సంకల్పించారట నిర్మాత రామ్ చరణ్.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ తో పాటు మోహన్ లాల్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ వార్త కాసేపటి క్రితం బయటకు రాగానే, మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదీకాక ఈ వేడుకకు వస్తున్న అతిథుల్లో పవర్ స్టార్ కూడా ఉండడంతో వారు మరింత సంబర పడిపోతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైరా సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ