పీవీ సింధుకి ఖరీదైన కారు..

- September 14, 2019 , by Maagulf
పీవీ సింధుకి ఖరీదైన కారు..

మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ క్రిడాకారిణి పీవీ సింధుకి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. నేటి మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు. స్విట్జర్లాండ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన పీవీ సింధు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com