ముంబయి పేలుళ్ల కేసు తీర్పు ఈరోజు వెల్లడైంది
- April 06, 2016ముంబయిలో 2002-03లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక పోటా కోర్టు ప్రధాన నిందితుడు ముజామ్మిల్ అన్సారీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేలుళ్లతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వాహిబ్ అన్సారీ, ఫర్హాన్ ఖోట్లకు కూడా జీవితఖైదు విధించింది. కేసులో మరో ముగ్గురు దోషులు సాఖిబ్ నచన్, అతీఫ్ ముల్లా, హసీబ్ ముల్లాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మార్చి 29న కోర్టు 13 మంది నిందితుల్లో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆరుగురికి ఇవాళ శిక్ష ఖరారు చేయగా మిగిలిన నలుగురు ఇప్పటికే చాలాకాలం జైలులో గడిపినందున నియమాల ప్రకారం బెయిల్ పత్రాలు సమర్పిస్తే విడుదలచేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.2002 డిసెంబరు 6న, 2003 మార్చి 13న జరిగిన ముంబయి పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. 2003 జనవరి 27న పేలుడులో ఓ వ్యక్తి మరణించారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు వెల్లడైంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ