స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు

- April 02, 2025 , by Maagulf
స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు

న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీకి నోటీసులు అందాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు వచ్చాయి.ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం రూ.158.25 కోట్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది.

తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ
2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి మధ్యకాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ.158.27 కోట్లుగా పేర్కొంటూ తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ షేర్లు రాణిస్తున్నాయి. 10:40 గంటల సమయంలో షేర్లు 2.80 శాతం లాభంతో రూ.340.85 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, స్విగ్గీకి గతంలోనూ ఇలాంటి జీఎస్టీ బకాయిలకు సంబంధించిన నోటీసులు జారీ అయిన విషయం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com