సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- November 01, 2025
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 మొదటి అర్ధభాగంలో దూసుకుపోయింది. 60.9 మిలియన్ల స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులు సౌదీని సందర్శించారు. ఈ మేరకు సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. ఈ కాలంలో మొత్తం పర్యాటక వ్యయం SR161.4 బిలియన్లను దాటింది.ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 4% వృద్ధిని నమోదు చేసింది.
ఇన్బౌండ్ పర్యాటకులకు సగటు స్టే 6.7 రాత్రులు మరియు దేశీయ ప్రయాణికులకు 18.6 రాత్రులుగా ఉందని డేటా తెలిపింది. ఇన్బౌండ్ పర్యాటకంలో మక్కా మరియు మదీనా అగ్ర గమ్యస్థానాలుగా ఉండగా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ దేశీయ పర్యాటకంలో ముందున్నాయి. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు కువైట్ సౌదీకి పర్యాటకులను పంపే మొదటి మూడు దేశాలుగా నిలిచాయి. ఆ తరువాత భారత్ , ఇండోనేషియా ఉన్నాయి.
ఇక స్టే ఎంపికలలో హోటళ్ళు 43% వాటాను కలిగి ఉన్నాయి. ఆ తరువాత ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు మరియు ప్రైవేట్ నివాసాలు ఉన్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD







