మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం

- November 02, 2025 , by Maagulf
మూడవ  ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం

హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుండి 5వ తేదీవరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం ( హైవే)లో నందమూరి తారకరామారావు వేదిక పై  నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జనవరి 4 వ తారీఖున సాయంత్రం  నిర్వహించే " తెలుగు వైభవ పురస్కారాల". సభకు  ముఖ్య అతిథి గా విచ్చేయమని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్ర సేనా రెడ్డిని పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ హైదరాబాద్ కలసి  వారిని ఆహ్వానించారు.

ఆయన ఎంతో సానుకూలం గా స్పందించి తప్పక ప్రపంచ మహా సభలలో పాల్గొంటామని, మాతృ భాషను నిలబెట్టు కోవడం తెలుగు వారి అందరి బాధ్యత అని.ఇంద్రసేనారెడ్డి అన్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com