ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- November 12, 2025
దుబాయ్: యూఏఈలో ఈ వారం ప్రారంభంలో భవనం పై నుంచి పడి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన మిషాల్ మొహమ్మద్ దుబాయ్లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ విషాద ప్రమాదం జరిగింది.
ఈ కేసును ఫాలో అవుతున్న సామాజిక కార్యకర్త M.K. ప్రకారం, 19 ఏళ్ల ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. “అతను తన బంధువుల కుటుంబంతో కలిసి హోర్ అల్ అంజ్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. భవనం యొక్క మూడవ అంతస్తు టెర్రస్ నుండి, విమానాలు దగ్గరగా కనిపించాయి. అతను దాని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భవనం పై నుండి పడిపోయాడు.” అన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతను మరణించాడని వారు తెలిపారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







