పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక

- November 12, 2025 , by Maagulf
పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ పై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ఈ సదస్సు ఏర్పాట్ల పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షనించనున్నారు.ఇందు కోసం సీఎం ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు.

రేపు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com