తెలంగాణ: R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు
- June 09, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖలో అత్యున్నత అధికారి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ నాయక్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ఉదయం నుంచి విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్తో పాటు స్వగ్రామంలోనూ తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని మోహన్ నాయక్ ప్రధాన నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మోపాల్ మండలం కులాస్ పూర్ తండాలోనూ ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. కులాస్పూర్ తండాలోని మోహన్ నాయక్కు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్లోనూ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
మోహన్ నాయక్ సొంత ఇళ్లే కాకుండా, ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువుల నివాసాలను కూడా ఏసీబీ వదల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లోని అతని బంధువుల నివాసాల్లో ఉదయం నుంచే ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పట్టుబడిన నగదు, ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









