విశాల్-లింగుస్వామిల రెండో 'పందెం కోడి' వస్తోంది!
- September 20, 2017
అటు తమిళంతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విశాల్. 'పందెంకోడి', 'భరణి', 'రాయుడు', 'ఇంద్రుడు', 'పూజ' తదితర చిత్రాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నారు. ఇక విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం 'పందెంకోడి'. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. విశాల్-లింగుస్వామి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో విశాల్, లింగుస్వామి, రాజ్కరణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలి చిత్రంలో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా, సీక్వెల్లో కీర్తిసురేష్ ఆడిపాడనుంది. వరలక్ష్మి శరత్కుమార్ ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







