పోలవరం టెండర్లు నవయుగ సంస్థలుకే
- January 30, 2018
దిల్లీలో ముగిసిన కీలక భేటీ దిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద కీలక భేటీ ముగిసింది. ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీటు, స్పిల్ ఛానల్ పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై ఈ సమావేశంలో ఓ స్పష్టత వచ్చింది. దీనిపై రెండు గంటలపాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీ అనంతరం మంత్రి గుత్తేదార్లతో కాసేపు సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్ట్రాయ్ గుత్తేదారు సంస్థల్లో వేటికి ఈ పనులు అప్పగించే అంశంపై చర్చించారు. పోలవరం ప్రధాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఇప్పటివరకు అనుకున్నవిధంగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయని నేపథ్యంలో ఈ పనులను నవయుగకు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పాత ధరలతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నవయుగతో అంగీకారం కుదిరింది. నవయుగ కంపెనీకి స్పిల్వే, ఛానల్ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదరనుంది. దీనిప్రకారం స్పిల్వే, స్పిల్ఛానల్ పనుల్ని నవయుగ సంస్థ వారం రోజుల తర్వాత చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి