రెండో వన్డేలో భారత్ ఘన విజయం

- February 04, 2018 , by Maagulf
రెండో వన్డేలో భారత్ ఘన విజయం

దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో సౌతాఫ్రికాను కట్టడి చేసిన భారత్... బ్యాటింగ్‌లోనూ విజృంభించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. దావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా..కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. అంతకుముందు 118 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. చాహల్, కుల్‌దీప్ దెబ్బకు సఫారీలు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చాహల్‌ 5 వికెట్లు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com