సోషల్మీడియాకు అనసూయ గుడ్బై ?
- February 07, 2018
సోషల్మీడియాకు గుడ్బై చెప్పిన అనసూయ?
హైదరాబాద్: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసినట్లున్నారు. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్ను పగలగొట్టారన్న కారణంగా అనసూయపై ఓ మహిళ కేసు పెట్టిన ఘటన దుమారం రేపింది. తాను ఫోన్ పగలగొట్టలేదని, బాలుడి తల్లి అబద్ధం చెబుతోందని అనసూయ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు కూడా.
అయినప్పటికీ నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తుండడంతో అనసూయ సోషల్మీడియా నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. ఆమె ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కన్పించడంలేదు. గతంలోనూ కొందరు తన దుస్తులపై కామెంట్లు చేస్తున్నారని వారిని బ్లాక్ చేయాలనుకుంటున్నానని అనసూయ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
సోషల్మీడియాలో ఎదురవుతున్న కామెంట్లు తట్టుకోలేక ఆమె అన్ని మాధ్యమాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. పలువురు అభిమానులు ఆమెకు మద్దతుగా సామాజికమాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి